అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎంపిక బుధవారం జరగనుంది. ఇందుకోసం ఎంపిక కమిటీ రూపొందించిన ముగ్గురు సభ్యుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. బుధవారం జరిగే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశంలో సీఈఓతో పాటు ప్యానెల్లోని ఇద్దరు సభ్యులు, జనరల్ సెక్రటరీ పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

