హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న తమ దేశానికి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) శుక్రవారంనాడు ఆరోపించింది. ఈ దాడులను సముద్ర దోపిడీ చర్యలుగా పేర్కొంది. అబుదాబీ ప్రభుత్వరంగ చమురు, సహజవాయివు సంస్థ అయిన అడ్నోక్కు చెందిన రెండు ట్యాంకర్లపై గురువారం సాయంత్రం ఈ దాడి జరిగినట్టు ఆ సంస్థ తెలిపింది. రెండు నౌకలు డ్రోన్ దాడుల్లో స్వల్పంగా దెబ్బతిన్నట్టు తమకు సమాచారం ఉందని బ్రిటిష్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ కేంద్రం కూడా తెలిపింది.