మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. పన్వెల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితులను బట్టి స్థానిక అధికారులు మరిన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.