విద్యాలయాల ఏర్పాటును వ్యతిరేకించడంపై మరోసారి ఆలోచించాలని సుప్రీంకోర్టు గురువారం సూచించింది. తమిళనాడులో హిందీని పూర్తిగా మినహాయించలేమని, ఢిల్లీలో ఉన్నవారికి ప్రజలు దూరమవ్వకూడదని కోర్టు అభిప్రాయపడింది. తమిళనాడు గడ్డపై హిందీ బోధనను అనుమతించమనే “వైఖరి”ని ఆ రాష్ట్రం మార్చుకోవాలని జస్టిస్ నాగరత్న అన్నారు. అంతేకాకుండా, భాషా పరమైన అంశంపై కేంద్రంతో తమిళనాడు చర్చలు జరపాలని ఆమె పేర్కొన్నారు. చెన్నై ప్రజలు ఢిల్లీకి, అలాగే ఢిల్లీ వారు చెన్నైకి దూరమవ్వకూడదు,” అని కోర్టు వ్యాఖ్యానించినట్లు ‘బార్ అండ్ బెంచ్’ నివేదించింది.