మహరాష్ట్రలో ఆదివారం జరగాల్సిన టీచర్స్ టెట్ పరీక్ష పేపర్ లీకవడంతో వాయిదా పడింది. పరీక్షకు 24 గంటల ముందే పేపరు బయట కనిపించడంతో లీకయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విద్యాధికారులకు తెలియజేయడంతో పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,028 కేంద్రాల్లో జూన్ 28న నిర్వహించాల్సిన TET 2026 పరీక్షను పారదర్శకత విశ్వసనీయతను కాపాడే ఉద్దేశంతో వాయిదావేసినట్లు మండలి పేర్కొంది. భివండీ పోలీస్ స్టేషన్లో దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.