ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఈ కేసులో తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో భాగంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు రావాలని సంతోష్ రావుకు అందజేసిన నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సంతోష్ రావు మాట్లాడుతూ.. రేపు సిట్ విచారణకు హాజరవుతా.. సిట్ ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు.

