ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో.. ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా కొన్ని రిటర్న్ గిఫ్ట్ లను అందించింది. భారత్ కు చెందిన అపురూపమైన చారిత్రక విగ్రహాలు, పూజా సామాగ్రిని వెనక్కి ఇచ్చేసిందా దేశం. ఇందులో భద్రకాళి అమ్మవారి రూపంతో కూడిన లోహపు త్రిశూలం, పవిత్ర రాతి నంది విగ్రహం, షణ్ముఖ కార్తికేయుడి రాతి విగ్రహం ఉన్నాయి. ఈ కళాఖండాలు చోళులు, విజయనగర రాజుల కాలం నాటివి.