జగిత్యాల జిల్లాలో పిచ్చికుక్కల దాడి కలకలం రేపింది. ఎండపల్లి మండలం గుడిసెలపేట గ్రామంలో బుధవారం నాడు పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. గ్రామానికి చెందిన సుమారు పది మందిపై ఈ కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక మహిళ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ముఖంపై కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గాయపడిన బాధితులందరినీ జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

