ఆస్ట్రేలియా నుంచి పాకిస్థాన్కు విహారయాత్రకు వచ్చిన ఓ ప్రవాస కుటుంబం తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంది. పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయంలో వారి కారును సాయుధ దొంగల ముఠా అడ్డగించింది. ఆ తర్వాత కుటుంబాన్ని బందీలుగా తీసుకున్న దొంగలు పోలీసులపై కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ప్రతిగా ఎదురుకాల్పులు జరిపారు. పోలీస్ అధికారి పొరపాటున బాధితుల కారుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక హనియా అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.