పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. రావల్కోట్ సహా పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి స్వేచ్ఛ కోసం నినాదాలు చేశారు. నిరసనకారులు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి, PoK ప్రధానమంత్రి ఫైసల్ ముంతాజ్ రాథోర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వారిని ఉగ్రవాదులుగా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

