పశ్చిమ నేపాల్లోని భారీ కొండచరియలు విరిగిపడటంతో చౌలానీ నది ప్రవాహం పాక్షికంగా స్తంభించిపోయింది. అపీ హిమాల్ రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని భట్టార్ ప్రాంతంలో ఈ భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండల నుంచి భారీగా వచ్చిపడిన రాళ్లు, మట్టి, వ్యర్థాలు చౌలానీ నదిలో పేరుకుపోయి నీటి సహజ ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలిగించాయి. మరిన్ని కొండచరియలు విరిగిపడితే నది పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని, ఆ తర్వాత ఒక్కసారిగా ఆకస్మిక వరదలు దిగువ ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని దార్చులా జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.