నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి మొత్తం సంఖ్య 13కి చేరింది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రాల లీక్ కేసులో లాతూర్కు చెందిన డాక్టర్ మనోజ్ శిరూరేను అరెస్టు చేశారు. బుధవారం విడుదల చేసిన సీబీఐ ప్రకటన ప్రకారం, నిందితుడైన కోచింగ్ సెంటర్ యజమాని కుమారుడితో సహా ముగ్గురు విద్యార్థులకు, నిందితుడైన పి.వి. కులకర్ణి నుంచి కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలను పొందడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు.