దిశా సాలియన్ను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమె ఎవరో తనకు తెలియదని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే అన్నారు. ఆమె మరణంతో తనను ముడిపెట్టడానికి పదేపదే జరుగుతున్న ప్రయత్నాలను ఆయన ఖండించారు. ఆధారాలు లేని దుష్ప్రచారమని ఆరోపించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు ఆయనకు మేనేజర్గా పనిచేసిన దిశా సాలియన్ భవనం పైనుంచి పడి మరణించారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై బాంబే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కొత్తగా దర్యాప్తు జరుపుతున్నది.

