టర్కీలో స్కూళ్లలో కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇలాంటి రెండు ఘటనలు జరిగాయి. పాఠశాలకు వచ్చిన ఒక విద్యార్థి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థి తండ్రి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతడి ఇంట్లో ఆయుధాలున్నాయి. దీంతో ఆ ఆయుధాల్ని తీసుకుని స్కూల్కు వచ్చిన విద్యార్థి అక్కడి వారిపై కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో నలుగురు మరణించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు కాగా, ఒకరు టీచర్. మరో 20 మంది గాయపడ్డారు.

