వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల ముసుగులో బలప్రదర్శనలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా విమర్శించారు. ఆయన ఇంటి నుంచి బయట అడుగు పెడితే చాలు రాష్ట్రంలో విధ్వంసం, అరాచకాలు తలెత్తుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ రకమైన చర్యల ద్వారా ప్రజలకు ఆయన ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వైకాపా నేతలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనిత హితవు పలికారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా ప్రవర్తిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు.