నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తిరుమల శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేస్తూ ఆలపించడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం కోట్లాదిమంది హిందువులు పవిత్రంగా భావించే దైవ నామాలను అపహాస్యం చేయడం అత్యంత శోచనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర నామాల కించపరిచే ఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ జనసేన నేతలను ఆదేశించారు. భక్తి భావాలను రాజకీయంలోకి లాగొద్దని స్పష్టం చేశారు.

