ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ప్రముఖ గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు ప్రమాదంలో పలువురు భారతీయులతో సహా 13 మంది మరణించారు. మరో 66 మంది గాయపడ్డారు. ఖతార్ ప్రభుత్వంతో పాటు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం దీనిని ధృవీకరించింది. కొందరి ఆచూకీ తెలియలేదని ఖతార్ ఇంధన శాఖ తెలిపింది. మృతులు, గాయపడిన వారి జాతీయత వివరాలను ఆ దేశ అధికారులు వెల్లడించలేదు. గ్యాస్ ప్లాంట్లో పేలుడును ‘సాంకేతిక ప్రమాదం’గా పేర్కొన్నారు.