దాదాపు 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) వార్షికోత్సవ సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నేటి యువతరం (జెన్ జీ) మాట్లాడే ఆధునిక పదజాలంతో ప్రసంగించి విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నారు. మీ భాషలో చెప్పాలంటే వారంతా అసలైన ‘ఓజీ’లు అంటూ చమత్కరించారు. రీసెంట్గా పాపులర్ అయిన ‘ధురందర్’ సినిమాను ప్రస్తావిస్తూ.. మీరు ధురందర్ కాకపోయినా పర్లేదు గానీ మీకంటూ ఒక ప్రత్యేక ప్రభావం చూపించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.