నల్గొండ జిల్లాలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో జరిగిన ఒక ఘోర రహదారి ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం ప్రకారం.. మరణించిన వారిలో ఇద్దరు మహిళలతో పాటు ఒక ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.