టీమిండియా నయా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరుసగా మూడో పరాజయాన్ని చవి చూశాడు. ఇంగ్లాండ్తో మొదటి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు కాగా, మాంచెస్టర్లో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. భారత జట్టు విధించిన 191 పరుగుల లక్ష్యన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించంది ఇంగ్లాండ్ జట్టు. రవి భిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 29 పరుగులు రాబట్టాడు జాకబ్ బెథల్.