కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి ఆచూకి కనిపెట్టడంతో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క హటాత్తుగా ఇవాళ మరణించినట్టు తెలుస్తోంది. చిన్నారి ఆచూకి తెలుసుకునేందుకు ఇటీవల అధికారులు కుక్కకు ట్రాకర్ అమర్చి బయటకు వదలగా ఇప్పుడు అది మరణించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్గా మారింది.

