ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ అత్యంత వేగంగా మరియు ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. గత మే 15 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఏకంగా 3,007 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 6,186 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగోలోని ఆరు ప్రధాన ప్రావిన్స్లలో ఈ వైరస్ దారుణంగా విస్తరిస్తోంది.