తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో దళపతి విజయ్ కోట్లాది మంది అభిమానుల ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ రిలీజ్ కు సెన్సార్ బోర్డు (CBFC) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ జన నాయగన్ చిత్రానికి ‘A’ (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇచ్చింది. సెన్సార్ పూర్తయినందున, ఈ చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.