ఆలోచనకు ఆకారం ఇవ్వడమే ఇంజినీరింగ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రగతికి నాంది పలికే వారే ఇంజినీర్లు. సమాజ పురోగతికి అహర్నిశలు శ్రమించే ఈ సాంకేతిక శిల్పుల త్యాగాన్ని, ప్రతిభను స్మరించుకునేందుకు ఏటా సెప్టెంబర్ 15న ‘ఇంజినీర్స్ డే’గా జరుపుకుంటాం. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ఆయనకు దేశం ఇచ్చే ఘన నివాళి. నేటి డిజిటల్ యుగంలో ‘కూర్చుంటే మాటలు.. నిలబడితే చేతలు’ అన్నట్లు కాలం గడిపే యువతకు విశ్వేశ్వరయ్య జీవితం స్ఫూర్తిమంతం.