పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ నివాసంపై జరిగిన పోలీసుల దాడిలో ఇంటి కింద అత్యంత విలాసవంతమైన రహస్య భూగర్భ ప్యాలెస్ను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఈ రహస్య గదిలో ఏకంగా ఒక బంగారు మంచాన్ని అధికారులు గుర్తించారు. కోట్లాది రూపాయల విలువైన ఇంటీరియర్ డిజైనింగ్తో కూడిన గదులు ఉన్నాయి. షమీమ్ అహ్మద్ తన భార్య పేరిట ఈ ఆస్తులను కూడబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్రమ ఆస్తుల సంపాదన, ఆర్థిక అక్రమాల ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు.