ఏపీ అభివృద్ధిని మోడీ భుజాన వేసుకున్నారని.. ఎన్డీయే హయాంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని చెప్పారు. దేశాన్ని ప్రధాని మోడీ 12 ఏళ్లుగా సమర్థంగా నడిపిస్తున్నారని కొనియాడారు. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చే ఘనత మోడీదేనని స్పష్టం చేశారు. సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా దేశంలో కాలుష్యం తగ్గిస్తున్నారని చెప్పారు. దేశంలో తీవ్రవాదం, నక్సలిజం లేకుండా మోడీ ప్రభుత్వం చేసిందని కొనియాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.