ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీలో హైదరాబాదీ ప్లేయర్ పీవీ సింధు ఇవాళ సెమీఫైనల్లో ఓటమి చవి చూసింది. జపాన్కు చెందిన మేటి ప్లేయర్ అకేన్ యమగుచి చేతిలో ఆమె వరుస గేమ్స్లో పరాజయాన్ని ఎదుర్కొన్నది. 20-22, 12-21 స్కోరుతో యమగుచి విజయం సాధించింది. మూడో నెంబర్ ర్యాంక్తో జపనీస్ ప్లేయర్ ఈ టోర్నీలో ఆడారు. కేవలం 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. సింధు ఓటమితో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్లో భారతీయ క్రీడాకారుల ప్రాతినిధ్యం ముగిసింది.

