రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు ఏపీ ప్రభుత్వం రూ.21.01 కోట్ల భారీ పర్యావరణ జరిమానా విధించింది. పీసీబీ నిబంధనలు పదేపదే ఉల్లంఘించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గోదావరి నది పరిసరాల్లో వ్యర్థాలు విడుదల చేస్తున్నందుకు ఈ భారీ జరిమానా వేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇటీవలే ఈ మిల్లుపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరించారు.