మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక మరో అరుదైన గౌరవం అందుకుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా యూనివర్సిటీ ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే హెర్మన్ బి వెల్స్ అవార్డుకు అన్షు ఎంపికైంది. ఈ విషయాన్ని రోజానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1961 నుంచి ఇండియానా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఒక అత్యుత్తమ విద్యార్థికి ఈ ప్రతిష్టాత్మకం ఈ పురస్కారం అందిస్తోంది.చదువుతో పాటు లీడర్ షిప్, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.

