పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమైన తర్వాత ప్రాజెక్టుల పురోగతి, కేటాయించిన నిధులు, వ్యయం, రైతుల రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీ వివరాలను ఆయన సభకు వెల్లడించారు. ప్రతిపాదించిన 119 పనులకు మొత్తం రూ. 66,802 కోట్లు ఖర్చవుతుందని, రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, హడ్కో, నాబార్డ్, NABFID, APPFC ల ద్వారా రూ. 41,187.70 కోట్ల మేర రుణాలు సమకూర్చుకున్నాం. ప్రస్తుతం పురోగతిలో ఉన్న 103 పనులకు రూ. 58,093 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు