వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రోహిత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇంటికి నిప్పుపెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద జరిగిన అగ్నిప్రమాదం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉందని పిటిషన్లో పేర్కొన్నారు రోహిత్. అదే విధంగా.. తమ ఇంటి వద్ద తగిన భద్రత కల్పించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్నూ ఆయన దాఖలు చేశారు.

