తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడులో శనివారం సాయంత్రం జరిగిన ప్రజా దర్బార్ సభకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ దీపికలు, ఆశా వర్కర్లు మంత్రికి తమ సమస్యలను విన్నవించుకున్నారు. కనీస వేతనం నెలకు రూ. 26,000 చెల్లించాలని ఆయనను కోరారు.