విజయవాడలో నడిరోడ్డుపై యువకులు కత్తులతో వీర విహారం చేశారు. గంజాయి బ్యాచ్ పట్టపగలే జనాలపై బీరు బాటిళ్లు విసిరి వీరంగం సృష్టించింది. గంజాయి బ్యాచ్ పిచ్చి చేష్టలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఇబ్బందులకు గురవుతంటే పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఈ సంఘటన జరగడంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది.

