రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని చెత్త బుట్టలో పారేస్తాం అంటూ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఆదివారం సంచలనం సృష్టించారు. ముస్లింలు అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో వరుస ర్యాలీల్లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నితీశ్ కుమార్ పాలన ఆగిపోయిన నీటిలా మారిపోయి.. ఇప్పుడు మురుగు వాసన వస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

