జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్ డ్రైవ్ ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. అధికారిక ప్రకటనలో ఈ నిషేధాన్ని ప్రకటించారు. సివిల్ సెక్రటేరియట్లోని అన్ని పరిపాలనా విభాగాలు,
జిల్లాల డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లో ఇది వర్తిస్తుంది. డేటా చోరీ, మాల్వేర్ దాడులు, అనధికార యాక్సెస్ లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించడమే ఈ నిబంధనల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. వాట్సాప్, Telegram లాంటి పబ్లిక్ మెసేజింగ్ యాప్స్ను కూడా వాడవద్దని స్పష్టం చేశారు.

