ప్రకాశంజిల్లా కంభం మండలం లింగోజి పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అంగన్వాడి కేంద్రానికి వెళ్లి అదృశ్యమైన మూడేళ్ళ బాలుడు లక్షిత్ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి కోసం 10 పోలీసు బృందాలు గాలించగా చివరకు బాలుడి మృతదేహం లభించింది.ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని హత్య చేసి అక్కడ పడవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

