దక్షిణ థాయిలాండ్లో ఘోరం జరిగింది. బుధవారం మధ్యాహ్నం సోంగ్ఖా హ్యాట్ హెయ్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడు జరిపిన కాల్పుల్లో 22మంది చిన్నారులు సహా 34మంది మరణించారు. చాలా మందిని అతను బందీలుగా చేసుకున్నాడు. పాఠశాలలో కాల్పుల మోత వినపడగానే రోడ్డుపై జనాలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

