ఎప్స్టీన్ చేసిన అరాచకాలలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వివాదంలో ఇప్పుడు ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఒక ఫొటో విడుదలైంది.
దీనికి సంబంధించిన మెయిల్లో ఈ ఈవెంట్ను ‘వైల్డ్’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోలో వీళ్లంతా రాత్రి పూట డిన్నర్ చేస్తుండగా, ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఈ అంశంపై ఇటీవల ఎలాన్ మస్క్ తాను ఎప్పుడూ ఎప్స్టీన్ పార్టీలకు హాజరు కాలేదని వెల్లడించాడు.

