అమెరికాలోని బిజినెస్ స్కూళ్లు.. ట్యూషన్ ఫీజులో భారీ తగ్గింపులు, స్కాలర్షిప్లు అందిస్తున్నాయని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ కథనంలో పేర్కొంది. ఏఐ రాకతో జాబ్ మార్కెట్ ప్రభావితం అవుతున్నందున.. బిజినెస్ కోర్సులకు దరఖాస్తులు మందగించడం, ఎంబీఏ విషయంలో అభ్యర్థులు పునరాలోచిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది. అనేక యూనివర్సిటీలు ఆన్లైన్, ఎగ్జిక్యూటివ్, స్పెషలైజ్డ్ బిజినెస్ ప్రోగ్రామ్లపై ట్యూషన్ ఫీజులను 50 శాతం వరకు తగ్గించాయని.. తక్కువ వ్యవధి గల, సౌకర్యవంతమైన కోర్సులను అందిస్తున్నాయని పేర్కొంది