ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, దానికి తగినట్లు ప్రోత్సాహకాలు అందిస్తామని AP సీఎం చంద్రబాబు ప్రకటనపై పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు జనాభా పెంపు కోసం మహిళలకు ఇలాంటి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించి విఫలం అయ్యాయని ఆమె గుర్తు చేశారు. మహిళలు కేవలం జనాభాను పెంచే సాధనాలు కాదని, మాతృత్వం అనేది వారి వ్యక్తిగత ఆశయాలు, ఆరోగ్యం, కెరీర్, ఇష్టాలపై ఆధారపడి ఉండే ఒక స్వతంత్ర నిర్ణయమని ఆమె పేర్కొన్నారు.