కేరళం నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ వీడీ సతీశన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సహా పలువురు నాయకులు హాజరయ్యారు.