loader

భారతీయులపై భారం, ఇక H-1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు..!

భారత్‌పై అమెరికా భారీ సుంకాల తర్వాత మరోసారి పిడుగు లాంటి వార్త . అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బి వర్కర్ వీసాలకు ఏడాదికి లక్ష డాలర్లు ఫీజు చెల్లించాలన్న ఉత్తర్వులపై సంతకం చేసేశారు. ఇది భారతీయులపై పెద్ద ప్రభావం చూపుతుంది. వారు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఇది 1500 డాలర్లు మాత్రమే ఉండేది. భారత్ పై ఇది అదనపు భారమే అని చెప్పాలి. ఎందుకంటే అత్యధికంగా హెచ్ 1 బి […]

చిన్నారుల కోసం ప్రత్యేక ChatGPT వెర్షన్..

OpenAI తన వినియోగదారుల భద్రతను మరింతగా పెంచడానికి మరియు వయస్సు ఆధారంగా వ్యక్తిగత అనుభవాన్ని అందించడానికి కొత్త మార్గాలను రూపొందిస్తోంది. కంపెనీ తాజాగా ప్రకటించిన ప్రణాళికల ప్రకారం, ChatGPT వినియోగదారుల వయస్సును గుర్తించే సాంకేతికతను అమలు చేయనుంది. ఒకరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఉన్నారని గుర్తిస్తే, వారికి ప్రత్యేకంగా రూపొందించిన ChatGPT వెర్షన్‌ను అందించనుంది. ఈ వెర్షన్‌లో సాధారణ ChatGPT కంటే భిన్నమైన ఫీచర్లు, భద్రతా పరమైన కంటెంట్ ఫిల్టర్లు, మరియు మరిన్ని జాగ్రత్తలు […]

కోడింగ్ కోసం కొత్త ఏఐను తీసుకొచ్చిన చాట్‌జీపీటీ!

ాట్ జీపీటీ రోజురోజుకీ అప్ డేట్ అవుతూ వస్తోంది. అవసరాలకు తగ్గట్టు ఇందులో రకరకాల కొత్త మోడళ్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఓపెన్ ఏఐ జీపీటీ 5 కోడెక్స్ అనే కొత్త మోడల్ ను ఇంట్రడ్యూస్ చేసింది. జీపీటీ 5 కోడెక్స్ ను ఉపయోగించి కోడ్ రాయడం, కోడ్ లో ఎర్రర్స్ గుర్తించడం, డీబగ్ చేయడం, రివ్యూ చేయడం వంటి పనులను చాలా ఈజీగా చేసేయొచ్చు. డెవలపర్లు సెపరేట్ గా ఈ టాస్క్ లు చేయొచ్చు లేదా ప్రోగ్రామింగ్ […]

పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి

తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్‌కు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికాలో దుర్మరణం పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2016లో ఎంఎస్ చదవడం కోసం అమెరికా వెళ్లిన అతడు, చదువులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం దొరకకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడు. పోలీసుల ప్రకటన ప్రకారం.. ఆ గొడవలో నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేశాడని , ఆ సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని, అందులో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు […]

సైన్స్ ఫిక్షన్ సినిమా తలపించే కొత్త స్మార్ట్ కళ్ళజోడు తెచ్చిన మెటా.!

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ పరికరాలకు పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా మెటా మరియు రేబాన్ సంయుక్తంగా ఇన్ లెన్స్ స్క్రీన్ ఫీచర్ తో ఈ కొత్త స్మార్ట్ కళ్ళజోడు అందించాయి. ఈ కొత్త కళ్లజోడు మామూలు కళ్ళజోడు గా కనిపిస్తుంది. అయితే, కోరుకున్నప్పుడు లెన్స్ పై స్క్రీన్ ప్రత్యక్షం అవుతుంది మరియు స్మార్ట్ కళ్ళజోడు గా మారుతుంది. చేతికి ధరించే ఆన్ రిస్ట్ కంట్రోల్ తో ఈ కొత్త స్మార్ట్ గ్లాస్ ని కంట్రోల్ చేసేలా డిజైన్ చేసి అందించింది.

అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం..

అమెరికా చట్టసభల భవనం క్యాపిటల్ ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం ఏర్పాటుపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేగుతోంది. కొందరు ఈ చర్యపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ట్రంప్ చేతిలో క్రిప్టో కరెన్సీ ఉన్నట్టు 12 అడుగుల ఎత్తు ఉండేలా ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. దీని కోసం క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు నిధులు సమకూర్చారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును 25 బేస్ పాయింట్ల మేర తగ్గించిన నేపథ్యంలో విగ్రహం ఏర్పాటు ఆసక్తికరంగా మారింది. దీన్ని […]

జార్జియా సరిహద్దుల్లో భారతీయ పర్యాటకులకు ఘోర అవమానం..

జార్జియా సరిహద్దులో భారతీయుల అవమానం – 56 మందికి నిరాకరణ జార్జియాలో భారతీయ పర్యాటకులు ఘోర అవమానానికి గురయ్యారు. సరైన పాస్‌పోర్టులు, ఈ-వీసాలు ఉన్నప్పటికీ 56 మంది భారతీయుల బృందాన్ని సదఖ్లో సరిహద్దులో ఐదు గంటలకు పైగా గడ్డకట్టే చలిలో ఆరుబయట నిలబెట్టారని, ఆ సమయంలో కనీస ఆహారం లేదా టాయిలెట్ సౌకర్యం కూడా ఇవ్వలేదని తెలిపారు. పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని, పశువుల్లా ఫుట్‌పాత్‌పై కూర్చోబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీ పటేల్ అనే మహిళ […]

భారత కాన్సులేట్‌ను స్వాధీనం చేసుకుంటాం.. ఖలిస్తానీ గ్రూప్‌ బెదిరింపులు

ఖలిస్తానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత్‌-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమైన వేళ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరించారు. అమెరికాకు చెందిన ఖలిస్తానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఈ బెదిరింపులకు పాల్పడింది. ఈ నెల 18న (గురువారం) వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడించి స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండొద్దంటూ ఓ ప్రకటనలో హెచ్చరించింది

ఐస్‌క్రీమ్‌ పేరును మార్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా గుర్తుపట్టే పేరు ‘ఐస్‌క్రీమ్‌’ కానీ, ఉత్తరకొరియా నియంతకు ఈ పేరు నచ్చలేదు. దీనివల్ల విదేశీ ప్రభావం తమ ప్రజలపై పడుతుందని కిమ్ అనుమానించారు. ఇక, వెంటనే తమ భాషలో ‘ఎసుకిమో’గా పేరు మార్చేశారు. కాకుంటే ‘ఇయోరియెంబోసెంగి (ఐసు మిఠాయి)’గా పిలవాలని ఆయన మినహాయింపు ఇచ్చినట్టు డెయిలీ ఎన్‌కే పత్రిక వెల్లడించింది. పొరుగున ఉన్న దక్షిణ కొరియా, అమెరికా సహా పశ్చిమ దేశాల పదాలు వినియోగాన్ని పూర్తిగా తొలగించడమే దీని లక్ష్యంగా పేర్కొంది.

అమెరికాలో మ‌ళ్లీ టిక్‌టాక్‌.. చైనాతో డీల్ కుదిరింద‌న్న ట్రంప్‌

టిక్‌టాక్ (TikTok) యాప్ మ‌ళ్లీ అమెరికాలో వాడ‌నున్నారు. ఆ సోష‌ల్ మీడియా యాప్ వాడ‌కం గురించి చైనాతో డీల్ జ‌రిగిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇవాళ వెల్ల‌డించారు. టిక్‌టాక్ యాప్‌ను ఆప‌రేష‌న‌ల్‌గా ఉంచేందుకు చైనా కంపెనీతో దాదాపు ఓ ఒప్పందం కుదిరిన‌ట్లు ఆయ‌న చెప్పారు. టిక్‌టాక్ వ్య‌వ‌హారం గురించి చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌ర‌పనున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. దేశంలోని యువ‌త ఆ యాప్ కోసం ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON