జార్జియా సరిహద్దులో భారతీయుల అవమానం – 56 మందికి నిరాకరణ జార్జియాలో భారతీయ పర్యాటకులు ఘోర అవమానానికి గురయ్యారు. సరైన పాస్పోర్టులు, ఈ-వీసాలు ఉన్నప్పటికీ 56 మంది భారతీయుల బృందాన్ని సదఖ్లో సరిహద్దులో ఐదు గంటలకు పైగా గడ్డకట్టే చలిలో ఆరుబయట నిలబెట్టారని, ఆ సమయంలో కనీస ఆహారం లేదా టాయిలెట్ సౌకర్యం కూడా ఇవ్వలేదని తెలిపారు. పాస్పోర్టులు స్వాధీనం చేసుకుని, పశువుల్లా ఫుట్పాత్పై కూర్చోబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీ పటేల్ అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్లో ఈ చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

