loader

బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య.. ఈసారి కారుతో తొక్కించి చంపి, ఆపై పరారీ!

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పెట్రోల్ పోయించుకుని డబ్బులు అడిగినందుకు ఒక హిందూ యువకుడిని కారుతో తొక్కి చంపి పారిపోయిన దారుణ ఘటన రాజ్‌బరి జిల్లాలో చోటుచేసుకుంది. పెట్రోల్ పోయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండానే ఆ కారును వేగంగా పోనివ్వడానికి డ్రైవర్ ప్రయత్నించాడు కారును ఆపడానికి ప్రయత్నిస్తూ వాహనానికి అడ్డంగా నిలబడ్డాడు. ఆ కారులో ఉన్న వ్యక్తులు కనికరం లేకుండా రిపన్‌ సాహాపై నుంచి కారును పోనిచ్చారు.

ఇరాన్‌వైపు అమెరికా యుద్ధనౌకలు.. వెనెజువెలా తరహాలో దాడికి అమెరికా సన్నాహాలు!

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ చుట్టూ తన సైనిక బలగాలను మోహరించడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నది. అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణించే అణు శక్తి సామర్థ్యమున్న యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ విమాన వాహక నౌక దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియా వైపు పయనమైనట్లు తెలుస్తున్నది.

స్వదేశానికి చేరుకున్న భారతీయులు

ఇరాన్‌లో అంతర్గత అల్లర్లు మరియు నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో, భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో ఒక ప్రత్యేక బృందం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత క్షేమంగా తమ గడ్డపై అడుగుపెట్టిన భారతీయులు, విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న తమ కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ గడిపిన ప్రతి క్షణం ప్రాణభయంతో కూడుకున్నదని, మాతృభూమికి చేరుకోవడం పునర్జన్మ వంటిదని వారు భావోద్వేగంతో వెల్లడించారు.

‘ఇరాన్‌లో 800 మందికి ఉరిశిక్ష రద్దు’- ట్రంప్ సంచలన ప్రకటన

ఇరాన్‌ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టైన 800 మందికి విధించాల్సిన ఉరిశిక్షలను ఇరాన్ ప్రభుత్వం రద్దు చేసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని తాను ఎంతో గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

భారత్​లో 5జీ యూజర్లు 40 కోట్లు- జ్యోతిరాదిత్య సింధియా

ప్రపంచంలో 5జీ నెట్​వర్క్​ వినియోగంలో భారత్​ రెండో అతిపెద్ద దేశంగా నిలిచిందని భారత కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. “40 కోట్లకు పైగా 5G వినియోగదారులతో, భారత్​ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G చందాదారుల స్థావరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఈ సాంకేతికతను స్వీకరిస్తున్న దేశాలలో ఒకటిగా నిలిచింది. 110 కోట్ల యూజర్లతో చైనా మొదటి స్థానంలో నిలువగా, 35 కోట్ల వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది.

ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం.. అణు పరీక్షలపై అనుమానం?

ఇజ్రాయెల్‌లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.  డొమినాకు సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, బీర్షెబా వంటి నగరాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఇజ్రాయెల్ రహస్యంగా నిర్వహించిన అణ్వాయుధా పరీక్షల ఫలితమని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు పెట్టుకోకండి.. ఇండియన్స్‌కు కీలక సూచన

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇజ్రాయెల్ అధికారులు, హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది.

థ్యాంక్యూ మారియా.. నోబెల్ శాంతి పురస్కారం ఇచ్చిన మచాడోపై ట్రంప్ ప్రశంసలు

వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో అందజేసిన నోబెల్ శాంతి పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. మచాడోకు కృతజ్ఞతలు చెప్పిన ట్రంప్..దీనిపై ట్రంప్ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా స్పందించారు. మచాడోను కలవడం గొప్ప గౌరవంగా ఆయన భావిస్తున్నానని తెలిపారు. ఆమె చాలా గొప్ప మహిళ అని పొగిడారు. నేను చేస్తున్న పనికి గుర్తింపు ఆమె తనకు వచ్చి నోబెల్ శాంతి పురస్కారాన్ని నాకు సమర్పించారు అని వెల్లడించారు.

సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

సరిహద్దులో పాకిస్తాన్‌ కుట్రలు కొనసాగుతున్నాయి. LOC దగ్గర పాకిస్తాన్‌ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్‌ను జారవిడుస్తున్నాయి. ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి ఆర్మీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని పూంచ్‌లోని దేగ్వార్ ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్‌లను గుర్తించిన భారత […]

ఇరాన్‌ అల్లర్లు- భారతీయులను తీసుకొచ్చేందుకు సిద్ధమైన కేంద్రం

ఇరాన్ నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. తొలి బృందాన్ని శుక్రవారం భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రయాణానికి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని టెహ్రాన్‌లోని భారత్‌ ఎంబసీ అధికారులు, విద్యార్థులను కోరినట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేత కారణంగా భారతీయులను సంప్రదించేందుకు ఇబ్బందిగా ఉందని పేర్కొంది. అయితే ఇరాన్‌లో దాదాపు 10వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON