loader

కొత్త జెర్సీతో ఆర్సీబీ.. కెప్టెన్ పై కోహ్లీ కామెంట్స్ వైరల్ !

ఐపీఎల్ 2025 ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘రాజత్ పటిదార్ ఆర్సీబీకి లాంగ్ టర్మ్ లీడర్’ అని అన్నాడు. ఆర్సీబీని నడిపించడానికి రజత్‌కు పెద్ద బాధ్యత ఉందనీ, ఛాంపియన్‌గా ఉండటానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. రాజత్ కూడా ఈ సందర్భంగా మాట్లాడాడు. కోహ్లీ, డివిలియర్స్ లాంటి లెజెండ్స్ ఆర్సీబీకి ఆడారని అన్నాడు. ఇప్పుడు అదే జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం గొప్ప […]

ఐపీఎల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం..

ప్రతి ఐపీఎల్ ఎడిషన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి స్టార్ కళాకారులను బీసీసీఐ ఆహ్వానిస్తుంది. బాలీవుడ్ స్టార్ నటి దిశా పటాని, ప్రముఖ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్, పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ స్టార్ ప్రదర్శనలతో పాటు, అనేక ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

ఎమోషనల్ ప్రోమో అభిమానులను అలరిస్తోంది

IPL 2025 సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, క్రికెట్ ఫీవర్ దేశవ్యాప్తంగా మళ్లీ జోరుగా మొదలైంది. ఈ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడానికి, స్టార్ స్పోర్ట్స్ కొత్త సీజన్‌కు ముందు ఒక ఎమోషనల్ ప్రోమోను విడుదల చేసింది IPL అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, కుటుంబ సభ్యులను, భావోద్వేగాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్లాట్‌ఫాం. ఈ కాన్సెప్ట్‌తో స్టార్ స్పోర్ట్స్ రూపొందించిన కొత్త ప్రకటన ప్రేక్షకుల హృదయాలను కదిలించింది.

ఐపిఎల్ సీజన్ 2025కి సర్వం సిద్ధం

అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2025కి మార్చి 22న తెరలేవనుంది. మే 25న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీకి తెరపడుతుంది. ఈసారి కూడా పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మార్చి 23న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభమవుతోంది.

IPL 2025: రూ. 2 కోట్ల ప్లేయర్‌పై 2 ఏళ్ల నిషేధం..

ఇంగ్లాండ్ దూకుడు బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి వచ్చే రెండేళ్ల పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిషేధించింది. బోర్డు కొత్త విధానం ప్రకారం, బ్రూక్ రాబోయే రెండేళ్ల పాటు వేలంలో పాల్గొనలేరు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి తెలియజేసింది. నిజానికి, బ్రూక్ ఇటీవల ఈ సీజన్ నుంచి చివరి క్షణంలో తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఈ తప్పుకు భారత బోర్డు అతన్ని శిక్షించింది.

ఎవ్వరూ రిటైర్ కావట్లేదు!.. 2027 వన్డే వరల్డ్ కప్‌పైనే టార్గెట్..

2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజాకి కూడా ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అంటూ ప్రచారం జరిగింది.  వీరిలో ఎవరు రిటైర్మెంట్ ఇస్తారోననే భయమే ఫ్యాన్స్‌ని ఎక్కువగా వెంటాడింది.  రిటైర్మెంట్ ఆలోచనే లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు భారత స్టార్ క్రికెటర్లు.. విక్టరీ సెలబ్రేషన్స్‌లో విరాట్ కోహ్లీతో కలిసి వికెట్ ఫైట్ చేసిన రోహిత్ శర్మ, ‘వీళ్లు మనం […]

ఛాంపియన్స్ పై ప్రముఖల ప్రశంసలు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీమ్ ఇండియా గెలుపును చరిత్రలో నిలిచిపోయేలా చేసిందని అన్నారు.భారత క్రికెట్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అంటూ పోస్ట్ చేశారు. టీమ్ ఇండియా గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ..అద్భుతమైన ఆట, అద్భుతమైన ఫలితం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తెచ్చినందుకు మన క్రికెట్ జట్టు పట్ల గర్వంగా ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీమ్ ఇండియా గెలుపుపై ట్వీట్ చేశారు.అదరగొట్టారు అబ్బాయిలూ! మీరంతా ఒక బిలియన్ గుండెల్ని గర్వపడేలా […]

ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతకు కళ్లు చెదిరే ప్రైజ్ మనీ!

ప్రపంచకప్ తర్వాత అతి పెద్ద టోర్నీగా, మినీ ప్రపంచ కప్ గా పరిగణించే ఈ ట్రోఫీ గెలిచిన విజేతకు ప్రైజ్ మనీ సైతం భారీగా ఉండబోతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని 53% పెంచింది. గెలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) దక్కుతాయి. అంటే విజేతకు రూ.20 కోట్లు అన్నమాట. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9.72 కోట్లు) వస్తాయి. సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, […]

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బిగ్‌ డే

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్‌, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌పై అద్భుతమైన విజయంతో సహా టోర్నమెంట్‌లో అజేయ రికార్డుతో టీమ్ ఇండియా ఫైనల్ పోరుకు చేరింది. కివీస్ ఆటుపోట్లను తిప్పికొట్టి టైటిల్‌ను గెలుచుకోవాలని ఆసక్తిగా ఉంది. దుబాయ్ వేదికపై టీమిండియాతో ఆధిపత్యంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఇక్కడ 10 మ్యాచ్‌లు ఆడితే 9 సార్లు గెలిచింది.

‘పిచ్‌ అడ్వాంటేజ్‌’ విమర్శలకు కౌంటర్‌

చాంపియన్స్‌ ట్రోఫీలో తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఒకే వేదికపై ఆడుతున్న భారత జట్టుకు ‘పిచ్‌ అడ్వాంటేజ్‌’ లభిస్తుందని వస్తున్న విమర్శలకు టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చాడు. దుబాయ్‌ తమ సొంత గ్రౌండ్‌ కాదని, ఇక్కడి పిచ్‌లు తమకూ కొత్త సవాళ్లను విసురుతున్నాయని తెలిపాడు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు నాసిర్‌ హుస్సేన్‌, అథర్టన్‌తో పాటు ఆసీస్‌ సారథి పాట్‌ కమిన్స్‌.. భారత్‌ అన్ని మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటం వారికి భారీ ప్రయోజనాన్ని చేకూర్చుతుందని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON