loader

మహబూబ్ నగర్ మేయర్ గా జి మమత ఎన్నిక..

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా జి మమత ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ పార్టీ నుంచి మూడవ డివిజన్ కార్పొరేటర్ జి మమత ను మేయర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతోపాటు అందరి మద్దతుతో ఎన్నికల ప్రక్రియ లాంచనంగా కొనసాగించారు.

బీజేపీకే దక్కిన కరీంనగర్ మేయర్ పీఠం

కరీంనగర్ మేయర్‌ పీఠం ఏ పార్టీకి దక్కనుందనే ఉత్కంఠకు తెర పడింది. కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్‌ పీఠాన్ని కమలదళం దక్కించుకుంది. డిప్యూటీ మేయర్‌గా అదే పార్టీకి చెందిన సునీల్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటించారు. కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ వ్యూహత్మకంగా వ్యవహరించారు. మేయర్ పదవికి పోటీ పడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థికి […]

పాలకుడిగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు – సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి

తాము పాలకులం కాదు సేవకులమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమకు సేవ చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. పాలకుడిగా తాను ఎప్పుడూ ప్రవర్తించలేదని, సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. గెలుపు ఓటమి అన్నింటికీ తానే బాధ్యత తీసుకుంటానని చెప్పానన్నారు. అచ్చంపేట అడవుల్లో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్​ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

నేను పంచిన చీరలు, డబ్బులు తిరిగి ఇవ్వండి.. ఇంటింటికీ తిరుగుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు వింత పోకడలకు వెళ్తున్నారు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.జ్యోతి ఓడిపోయారు. దీంతో ఎన్నికల ముందు తాను ఇచ్చిన డబ్బులు, చీరలు తిరిగి ఇవ్వాలని కుటుంబసభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్నారు. జ్యోతి తీరుపై స్థానిక ఓటర్లు మండిపడుతున్నారు. అసలు చీరలు ఎవరు ఇవ్వమన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన బెల్లంపల్లి కౌన్సిలర్లు

బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కెటిఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్‌తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి బిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బిజెపికి చెందిన 34వ వార్డు అభ్యర్థి […]

రైతు సంఘాల నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పలు రైతు సంఘాల నేతలను కలిశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన ఆయన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో రైతు నేతలతో భేటీ అయ్యారు. భారత్‌, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు.  భారత్‌, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై రైతు సంఘాల నేతలతో రాహుల్‌ గాంధీ చర్చించారు.  రైతుల ప్రయోజనాలు కాపాడటంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

సీఎం చంద్రబాబును కలిసిన మహిళా ప్రజాప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రేపటి మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని, కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు శివతత్వానికి ప్రతీకగా ఉన్న చీరలను ధరించి సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

త్రిష‌ను వ‌దిలిపెట్టి ఇల్లు చక్కదిద్దుకో..విజయ్‌పై బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం పెను దుమారం రేపుతున్నాయి. విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ, విజయ్ ముందు తన ఇల్లు దాటి బయటకు రావాలని, నటి త్రిషతో ఉన్న అనుబంధం నుంచి బయటపడితేనే ఆయనకు రాజకీయ వాస్తవాలు తెలుస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు.

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే పీఎం రాహత్.. ప్రారంభించిన ప్రధాని

ప్రధాన మంత్రి నూతన కార్యాలయ భవనం సేవా తీర్థ్‌ను ఇవాళ (శుక్రవారం) ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక నూతన కార్యాలయంలో తొలి రోజున ప్రధాని ఓ కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు పీఎం-రాహత్ పేరిట ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రమాద క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకూ వైద్య చికిత్స అందజేయనున్నారు.

జనగామ మున్సిపాలిటీపై ఉత్కంఠ.. వార్డుల వారీగా ఫలితాలు

జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 13 వార్డుల్లో, కాంగ్రెస్ 12 వార్డుల్లో విజయం సాధించింది. నాలుగు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, ఒక వార్డులో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్రుల మద్దతు కీలకం కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొందడం విశేషంగా మారింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON