loader

పిఠాపురంలో డీసీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ, “ఏదైనా కూలగొట్టడం, చెడగొట్టడం తేలిక. కూటమి ఏర్పాటు చేయ్యడం కష్టం, దాన్ని చెడగొట్టడం తేలిక. పిఠాపురంలో పక్షి ఈక పడినా ఏదో జరిగిందని అతి ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంలో కొబ్బరాకు పడినా, ఏదో దారుణం జరిగిందని వైసీపీ వారు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటే.. నేను రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఉండేది కాదు. రాజకీయాలంటే డబ్బు కాదు, బాధ్యత. డబ్బు కోసమే రాజకీయాల్లోకి రాలేదు. […]

‘బీజేపీ అంటే భ్రష్ట జనతా పార్టీ’- డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వాలపై రాహుల్ ఫైర్

బీజేపీ పాలిత ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీని భ్రష్ట జనతా పార్టీగా అభివర్ణించిన రాహుల్​, అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని దుయ్యబట్టారు. పేదలు, కార్మికులు, మధ్యతరగతి ప్రజల అభివృద్ధిలో డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. అంకిత భండారీ హత్య కేసు లాంటి కేసుల్లో నిందితులకు రక్షణ ఎలా లభిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా పోస్ట్ చేశారు.

అమిత్​ షా కార్యాలయం ఎదుట టీఎంసీ నిరసన

బంగాల్​ కోల్‌కతాలోని ఐ-ప్యాక్‌ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ED దాడులను నిరసిస్తూ దిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌-TMC ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ దిల్లీలోని కేంద్రహోం మంత్రి అమిత్‌ షా కార్యాలయం వద్ద TMC ఎంపీలు నిరసనలు చేశారు. డెరెక్‌ ఓబ్రియెన్‌, మహువా మొయిత్రాతో సహా మరికొంత మంది ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులు పట్టుకొని అమిత్‌ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై వైఎస్‌ జగన్‌ మొసలి కన్నీరు : ఏపీ మంత్రి పార్థసారథి

మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై వైఎస్‌ జగన్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని జగన్‌ వ్యాఖ్యనించడాన్ని తప్పుబట్టారు. ఐదేండ్ల పాటు ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఆయనకు మాట్లాడే అర్హత లేదని తెలిపారు. ఇంకా అమరావతి మీద విషం చిమ్మడం అనేది సరైనది కాదని అన్నారు. ఎంఎస్‌ఎంఈ సూక్ష్మ,మధ్య తరహ ఎంటర్‌ప్రైనర్‌లో పార్కుల ఏర్పాటకు అవసరమయ్యే రూ.250 కోట్ల మంజూరుకు కేబినేట్‌ ఆమోదం తెలిపిందన్నారు.

మేడారం జాతరకు కెసిఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు

జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. ఈ మహాజాతరకు సర్కార్ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అధికారికంగా అందజేశారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సర్కార్ ఆహ్వానించింది. గురువారం మంత్రులు సీతక్క, కొండా సురేఖలు.. ఎర్రవల్లిలోని కెసిఆర్ నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. మేడారం జాతరకు రావాలని […]

తమిళనాడు ఎన్నికలు.. బీజేపీ-ఏఐఏడీఎంకే మధ్య సీట్లు ఖరారు..?

త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు పొత్తులు, సీట్ల కోసం అప్పుడే కసరత్తు ప్రారంభించాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, ఏఐఏడీఎంకే కీలక నేత పళనిస్వామి మధ్య సీట్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేయబోయే సీట్లు, మంత్రి పదవుల విషయంలో అమిత్ షా ఆచితూచి అడుగులేస్తున్నారు. అక్కడ మొత్తం 234 అసెంబ్లీ సీట్లకుగాను, 56 సీట్లు కావాలని అమిత్ షా.. […]

నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు..సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీష్‌ రావు ధ్వజం

నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండపై మాజీ మంత్రి హరీష్‌ రావు తీవ్రంగా మండిపడ్డారు. నిన్న దిల్‍సుఖ్‍నగర్, నేడు అశోక్ నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నవు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకు పోరాటం చేస్తాం: రేవంత్ రెడ్డి

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని బిజెపి రద్దు చేయబోతుందని, అధికారం ఉంది కదా అని ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకు పోరాటం చేస్తామని సిఎం పేర్కొన్నారు.

చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత వాళ్లకు లేదు: జెసి ప్రభాకర్

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత వైసిపి వాళ్లకు ఉందా? అని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు జెసి కౌంటర్ ఇచ్చారు. రాయలసీమలిఫ్ట్‌పై వైఎఆస్‌ఆర్‌సిపి వాళ్లు ఏం చేశారని నిలదీశారు. ధర్మవరం మాజీ ఎంఎల్‌ఎ వెంకట్రామిరెడ్డి రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడతున్నారని మండిపడ్డారు. తాడిపత్రి మాజీ ఎంఎల్‌ఎ పెద్దారెడ్డికి పౌరుషం లేదని విమర్శించారు. చీము రక్తం ఉంటే తాడిపత్రి రావాలని సవాల్ విసిరారు. కేతిరెడ్డికి  జగన్ ఈ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON