బీజేపీ పాలిత ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీని భ్రష్ట జనతా పార్టీగా అభివర్ణించిన రాహుల్, అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని దుయ్యబట్టారు. పేదలు, కార్మికులు, మధ్యతరగతి ప్రజల అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. అంకిత భండారీ హత్య కేసు లాంటి కేసుల్లో నిందితులకు రక్షణ ఎలా లభిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

