loader

టీడీపీ ఎమ్మెల్యే గన్‌మెన్ సస్పెండ్,. అసలు కారణమదే..

అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం ఎస్పీ.. ఘటనపై దర్యాప్తు జరిపి  టీడీపీ ఎమ్మెల్యే గన్‌మెన్‌ షేక్షావలిని సస్పెండ్ చేశారు.

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు – పాల్గొన్న సీఎం చంద్రబాబు కుటుంబం

ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్‌, నారా బ్రాహ్మణి, దేవాంశ్‌, బాలకృష్ణ సతీమణి వసుంధర, తేజస్విని, శ్రీభరత్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. ముగ్గులు బాగా వేశారంటూ మహిళలను ప్రశంసించారు. గ్రామంలో నిర్వహించిన సంప్రదాయ క్రీడా పోటీలను తిలకిస్తూ ఉల్లాసంగా గడిపారు.

‘జననాయగన్’ వాయిదాపై రాహుల్ గాంధీ ఫైర్.. ప్రధాని మోదీపై విమర్శలు

విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీ స్తాపించిన నేపథ్యంలో ‘జననాయగన్’ మూవీ వాయిదా అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను అడ్డుకోవడం అంటేనే తమిళ సంస్కృతిపై దాడి చేయడమే అని రాహుల్ అన్నారు. ‘‘ ‘జననాయగన్’ సినిమాను అడ్డుకోవడం ద్వారా కేంద్ర సమాచార, ప్రసార శాఖ తమిళ సంస్కృతిపై దాడి చేస్తోంది. మోదీ గారు.. తమిళ ప్రజల్ని అణచివేయాలనే మీ ప్రయత్నాలు సఫలం […]

పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైండని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రైతులకు రైతుభరోసా ఇయ్యలేదని, కనీసం యూరియా బస్తాలు కూడా ఇయ్యడం లేదని, ఆసరా పెన్షన్‌లను పెంచుతానని చెప్పి పెంచలేదని, మహిళలకు రూ.2,500 ఇయ్యలేదని రేవంత్‌ తీరును తప్పుపట్టారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కతరని చెప్పారు.

కరూర్‌ తొక్కిసలాట కేసు.. ముగిసిన విజయ్‌ సిబిఐ విచారణ

తమిళనాడులో తీవ్ర విషాదం మిగిల్చిన కరూర్‌ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్‌, నటుడు విజయ్‌ సిబిఐ విచారణ ముగిసింది. విచారణ కోసం సోమవారం విజయ్, ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు ఆరు గంటలపాటు సిబిఐ ఆయనను ప్రశ్నించింది. విచారణ అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు.ఇప్పటికే తమిళగ వెట్రి కజగం (టీవీకే) కు చెందిన పలువురు ఆఫీసు బేరర్లను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో సిబిఐ.. చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.

‘ఏఐ’ సాంకేతికతతో నిజమైన ఓటర్లకు తిప్పలు- సీఈసీకి సీఎం మమత మరో లేఖ!

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. “ఎన్నికల సంఘం 2002 నాటి ఓటర్ల జాబితాను డిజిటలైజ్ చేసింది. ఇందుకోసం ‘ఏఐ టూల్స్’ వినియోగించింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఏఐ చేసిన తప్పుల వల్ల అర్హులైన, నిజమైన ఓటర్ల వివరాల్లో భారీగా తేడాలు వచ్చాయి. ఆ తప్పులను సాకుగా చూపి, అసలైన ఓటర్లను కూడా ‘లాజికల్ డిస్క్రిపెన్సీస్’ జాబితాలో చేర్చారు. దీనివల్ల లక్షలాది మంది సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు […]

పవనన్న జిజ్ఞాస అద్భుతం.. ఆయన తపన యువతకు స్ఫూర్తి: నారా లోకేష్

పవనన్న జిజ్ఞాస అద్భుతం.. ఆయన తపన నేటి తరానికి స్ఫూర్తి అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ” పవన్ కళ్యాణ్ గారికి మనః పూర్వక అభినందనలు. పురాతన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

శబరిమల బంగారం చోరీ వ్యవహారం.. పినరయి సర్కార్‌పై అమిత్‌షా నిప్పులు

సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. బంగారం మాయం కావడానికి బాధ్యులైన వారికి ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఈ ఘటన కేవలం కేరళకే పరమితం కాదని, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులతో ముడిపడిన అంశమని చెప్పారు. కీలకమైన పుణ్యక్షేత్రంలోని విలువైన వస్తువులను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల మత విశ్వాసాలను ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అరుదైన, ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన అంకితభావానికి నిదర్శనంగా, ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారం, ‘టకెడా షింగెన్ క్లాన్’లో తొలి తెలుగు వ్యక్తిగా ప్రవేశం పొందారు.

ఎస్పీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ సడెన్ ఎంట్రీ.. నేరుగా నిఘా గదిలోకి

డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. కాకినాడ ఎస్పీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకుని. నిఘా భద్రతకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న కెమెరాలు ముఖ్యంగా కాకినాడ నగరం రూరల్ పిఠాపురం వంటి ప్రాంతాలలో ఏ విధంగా ఉంది సిసి కెమెరాల ద్వారా ఇక్కడ డిస్ ప్లే ఏ విధంగా కనిపిస్తుంది అన్న విషయాన్ని నేరుగా ఆయన భద్రత గదిలోకి చేరుకుని పరిశీలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON