ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్, నారా బ్రాహ్మణి, దేవాంశ్, బాలకృష్ణ సతీమణి వసుంధర, తేజస్విని, శ్రీభరత్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. ముగ్గులు బాగా వేశారంటూ మహిళలను ప్రశంసించారు. గ్రామంలో నిర్వహించిన సంప్రదాయ క్రీడా పోటీలను తిలకిస్తూ ఉల్లాసంగా గడిపారు.

